by Paresh Turlapati

ఆదివారం పొద్దున్నే విజయవాడ అలంకార్ సెంటర్లో జరిగే గారడీలు చూసారా ? దీన్నే కూటి కోసం కోటి విద్యలు అంటారేమో ?

ఆదివారం వస్తే చాలు విజయవాడ వాసులు అలంకార్ థియేటర్ సెంటర్లో గుమిగూడుతారుఅలా గుమిగూడిన జనంలో నేను కూడా ఉండేవాడినిజనం అలా గుమిగుడటానికి ఓ కారణం ఉంది పొద్దున్నే అలంకార్ థియేటర్ సెంటర్లో ఓ మూల మీద పాముల బుట్టతో ఓ కుటుంబం చేసే చిత్ర విచిత్ర టక్కుటమార గారడీలు మొదలౌతాయి భార్యా భర్త ఇద్దరు పిల్లలు గారడీ విద్యలను ప్రదర్శిస్తారు ఈ గారడీ ప్రదర్శనలో భాగంగా మొదట బుట్టలో పాములను బయటికి తీసి నాగ స్వరం ఊది…

Read More

కుబేరకు ధనుష్ ప్రాణం పోసాడు !

క్రైం డ్రామా సినిమాలు తియ్యడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైలు .. కధలో భాగంగా మితిమీరిన వయొలెన్స్ జొప్పించి మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో దర్శకుడు బోయపాటిది ఒక స్టైల్ కాగా , క్రైం స్టోరీలోనే బలమైన భావోద్వేగాలను .. ఫ్యామిలీ సెంటిమెంటుని కూడా జొప్పించి ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించడంలో శేఖర్ కమ్ములది మరో స్టైలు కుబేర సినిమా ఆ కోవలోకే వస్తుంది సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో క్రైమ్ .. వయొలెన్స్ తక్కువగా…

Read More

“మిస్టర్ రాకేశ్ శర్మ ! అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎలా కనిపిస్తుంది ?” భారత ప్రధాని ఇందిరాగాంధి ప్రశ్న

“మిస్టర్ రాకేశ్ శర్మ ! అంతరిక్షం నుంచి చూస్తే భారత దేశం ఎలా కనిపిస్తుంది?” భారత ప్రధాని ఇందిరా గాంధి ప్రశ్న ” సారే జహా సే అచ్ఛా” రాకేశ్ శర్మ జవాబు అప్పట్లో ఈ జవాబు కోట్లాదిమంది భారతీయుల హృదయాలను తాకింది.. గర్వంతో ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగింది.. అందుకు కారణం ఉంది.. అంతరిక్షంలోకి అడుగు పెట్టిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ 1984 ఏప్రిల్ 3 న ఇండియా.. రష్యా భాగస్వామ్య వ్యోమ నౌక…

Read More

రామ్ గోపాల్ వర్మ బెజవాడలో జరిగిన ఆ సన్నివేశం నేపథ్యమే శివ సినిమాలో వాడుకున్నాడా? వంగవీటి మూవీ స్టోరీ అదేనా?

రామ్ గోపాల్ వర్మ చెప్పిన బెజవాడ ముచ్చట రానా దగ్గుబాటి టాక్ షో లో రామ్ గోపాల్ వర్మ ని రానా ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్యలో మా బెజవాడ మాట రావడంతో ఆసక్తిగా చూసా శివ సినిమా నేపథ్యం బెజవాడ గ్రూపుల నుంచే తీసుకున్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పాడు రామ్ గోపాల్ వర్మ కూడా నాలాగే బెజవాడలో చదువుకున్నాడు బెజవాడ వాసులకు స్థానిక రాజకీయాలు బాగా తెలుసుమరీ ముఖ్యంగా విద్యార్థి రాజకీయాలు అప్పట్లో రామ్ గోపాల్…

Read More

ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పింగళి దశరథ రామ్!

1980 లలో చాలామందికి ఎన్కౌంటర్ మ్యాగజైన్ గురించి తెలిసే ఉంటుంది.. ఆ పత్రిక వ్యవస్థాపకుడు 23 ఏళ్ల యువకుడు పింగళి దశరథ రామ్.. విజయవాడ సత్యనారాయణ పురంలోని తన ఇంటినుంచే వంద కాపీలతో ఎన్కౌంటర్ మ్యాగజైన్ ప్రారంభించాడు.. అనతి కాలంలోనే మ్యాగజైన్ ఐదు లక్షల సర్కులేషన్ కు చేరుకుంది.. ఇందుకు కారణం పింగళి దశరథ రామ్ తన పదునైన కలంతో రాజకీయ నాయకుల చీకటి భాగోతాలను వెలికి తీయడమే! అప్పట్లో పింగళి దశరథ రామ్ మ్యాగజైన్ చూస్తే…

Read More

కాంతారావు అవార్డుకు పది లక్షల రూపాయలు.. కాంతారావు కుటుంబానికి వెయ్యి రూపాయలా?

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు అంటే చాలామందికి తెలియకపోవచ్చు.. సినీ కళాకారుడు కత్తుల కాంతారావు అంటే అందరూ చప్పున గుర్తుపడతారు.. ఈయన్నే అభిమానులు అప్పట్లో ఆంధ్రా ఎంజీఆర్ అని పిలుచుకునే వాళ్ళు ఒకటా రెండా 450 కి పైగా చిత్రాల్లో నటించారు కాంతారావు.. ముఖ్యంగా పౌరాణిక, జానపద సినిమాల్లో కత్తులు తిప్పాలంటే కాంతారావు తర్వాతే ఎవరైనా అని పేరు తెచ్చుకున్నారు.. ఆ రోజుల్లో కాంతారావు చరిష్మా ఎలా ఉండేదంటే NTR , ANR లతో పాటు సమానంగా ఈయన…

Read More

నా భార్యకు మంగళ సూత్రం కావాలి బాబూ అంటూ తనదగ్గర ఉన్న 1120 రూపాయలను బల్ల మీద బోర్లించాడు 93 ఏళ్ల వృద్ధుడు.. అప్పుడు జ్యువలరీ షాపు యజమాని ఏం చేశాడు ?హృదయాలను పిండేసే వాస్తవ సంఘటన..!

మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీ నగర్ లో 93 ఏళ్ల వృద్ధుడు తన భార్య శాంతాబాయి తో కలిసి జ్యువలరీ షాపుకు వెళ్ళారు వీరి ఆహార్యం చూసిన షాపు కుర్రాడు గుమ్మంలోనే ఆపి ‘ ఏం కావాలి? అని అడిగాడు దానికి ఆ వృద్ధుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ భార్య వైపు ప్రేమగా చూస్తూ ‘ నా పెళ్ళానికి మంగళ సూత్రం కావాలి బాబూ ‘ అన్నాడు కానీ ఆ కుర్రాడు మాత్రం వీళ్ళ వాలకం చూసి చిరాకుతో…

Read More

అప్పట్లో షాడో మేనియా అట్లుండేది !

నవ్వకండి..ఇది సీరియస్ మ్యాటర్ 1970-80 లలో కుర్రకారును డిటెక్టివ్ సాహిత్యం ఒక ఊపు ఊపింది ఎంతలా అంటే అప్పట్లో డిటెక్టివ్ పుస్తకాలు మార్కెట్లోకి రావటం ఆలస్యం హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి మధు బాబు , గిరిజశ్రీభగవాన్ , కొమ్మూరి సాంబశివరావు లతోపాటు మరికొంతమంది రచయితలూ ప్రత్యేకంగా డిటెక్టివ్ నవలలు రాయడంలో పేరు సంపాదించుకున్నారు ఎవరి స్టైలు వారిదే మధుబాబు రాసిన షాడో సంచనాలు సృష్టించింది షాడో నవల కోసం వేలాదిమంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాళ్ళుఆ…

Read More

“హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం జంధ్యాల”

అమరుడు జంధ్యాల – భండారు శ్రీనివాసరావు( జూన్ 19 జంధ్యాల వర్ధంతి) బెజవాడ ఎస్సారార్ కాలేజీలో నా క్లాస్ మేట్ జంధ్యాల రాసిన ‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటకం రిహార్సల్స్ హనుమంతరాయ గ్రంధాలయంలో వేస్తుంటే వెంట నేనూ వుండేవాడిని, ఏ వేషమూ వేయకపోయినా. ఏదో కవితలు గిలకడం వచ్చనే పేరు నాకూ వుండేది. దాంతో మా స్నేహం మరింత చిక్కబడింది. డిగ్రీ తరువాత మా దారులు వేరయ్యాయి. నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆయన కధ సినిమా మలుపులు తిరుగుతూ…

Read More

ఏరా భోజనం చేసావా ? అన్నారు ప్రకాశం పంతులు గారు .. అప్పుడు సమయం తెల్లవారి ఐదు గంటలు .. స్టేషన్ మాస్టారుకి పంతులు గారు అడిగింది అర్ధం కాలేదు !

“సార్..ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూంలో పడక్కుర్చీలో నిద్ర పోతున్నారు..టికెట్ లేదు..బయటికి వెళ్లమంటే వెళ్ళట్లేదు ” స్టేషన్లో వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ చేసింది అది రాజమండ్రి స్టేషన్సమయం తెల్లవారి ఐదు గంటలు ‘సరే నేను వస్తా పద ‘అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూంకి వెళ్ళాడు అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక్కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు…

Read More
error: Content is protected !!