నేపాల్ పార్లమెంటుపై యువత దాడి – మొట్టమొదటి సోషల్ మీడియా ప్రభావిత విప్లవం!

Spread the love

నేపాల్ పార్లమెంటుపై యువత దాడి – మొట్టమొదటి సోషల్ మీడియా ప్రభావిత విప్లవం

      సోషల్ మీడియా... గత పదేళ్లుగా ప్రారంభమయిన ఈ విస్తృత మీడియా ప్రభావం ఎంతగావుందంటే, ఒక్క సారిగా సోషల్ మీడియాను నేపాల్ ప్రభుత్వం నిలిపి వేయడంతో కోపోద్రిక్తులైన నేపాల్ యువత ఆ దేశ పార్లమెంటును ఆక్రమించారు.

దీనితో తప్పనిసరై నేపాల్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నియంత్రించడానికి సైన్యాన్ని రంగంలోకి దించింది.

పెద్ద అరుణ నిరసనలు, కాల్పులు, 19 మంది మరణం, 100 మందికి పైగా గాయాలు, ఫలితంగా సోషల్ మీడియా పై నిషేధం ఎత్తివేత, నేపాల్ హోం మంత్రి రాజీనామా… ఇవి నేపాల్ లో జరుగుతున్న పరిణామాలు.

    ఒకవిధంగా చెప్పాలంటే, ప్రపంచంలో మొట్టమొదటి సోషల్ మీడియా ప్రభావిత విప్లవం అని చెప్పవచ్చు. 

   తమ దేశ నిబంధనలు పాటించడంలేదనే ఆరోపణలతో ఎక్స్, ఫేస్  బుక్, వాట్సాప్ లతో సహా 26 సోషల్ మీడియా ఆప్ లను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది  

మరోపక్క ఇప్పటికే, జెన్-జీ అనే బ్యానర్ పై నేపాల్ రాజరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతకు, నేపాల్ ప్రభుత్వం చేసిన సోషల్ మీడియా బ్యాన్ ఒక ఊతంగా లభించింది.

దీంతో వేలాది మంది యువత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలను చేశారు.” Gen Z Revolution” అనే నినాదాలతో ర్యాలీలు, పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శనలు సాగిస్తున్నారు.

ఈనేపథ్యంలో, లాఠీచార్జీలు, మీడియా స్వేచ్చపై దాడులు వంటి చర్యలు కొనసాగాయి.

మరోపక్క యువత నిర్వహిస్తున్న ఆందోళన,ప్రదర్శనల కారణంగా ఖాట్మండు, విరాట్‌నగర్ తదితర ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు

నేపాల్ Gen Z Revolution” నేపధ్యం ఇదీ

నేపాల్‌లో "జెన్-జీ ఉద్యమం"  ఇటీవల ఆ దేశ యువత ప్రారంభించిన  శక్తివంతమైన ఉద్యమం.

ప్రధానంగా 1997 తర్వాత జన్మించిన “జెన్-జీ” తరానికి చెందిన యువత ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు.

ఈ ఉద్యమం అవినీతిని, ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని, సోషల్ మీడియాపై నిషేధాన్ని, మరియు ప్రజాస్వామిక హక్కులపై విధించిన ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

మొత్తం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను , తమ దైనందిన జీవితంలో భాగమైన సోషల్ మీడియాను నేపాల్ ప్రభుత్వం ఒక్కసారిగా బ్యాన్ చేయడంతో ఒక్కసారిగా వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చారు.

ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో భాగస్వామ్యమైన ఈ Gen Z Revolution” గ్రూప్ కు, సోషల్ మీడియాపై నిషేధం ఉద్యమానికి మరింత ఊపునిచ్చాయి.

సమాజంలో మార్పు కోరుతూ పెద్ద ఎత్తున ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు.. ఆందోళనల్లో వేలమంది యువత పాల్గొంటున్నారు.

“Gen Z Revolution” అనే నినాదాలతో ర్యాలీలు, పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శనలు సాగిస్తున్నాయి. ఇది ఏ పార్టీ నాయకత్వం లేకుండా, స్వతంత్రంగా యువత ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమంగా పేర్కొనవచ్చు.

     ప్రపంచంలో పలు దేశాలు గతంలో (తాత్కాలికంగా లేదా శాశ్వతంగా) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాయి లేదా పరిమితం చేశాయి.

చైనా, ఇరాన్, ఉత్తర కొరియా లలో కఠిన నిషేధాలు ఉన్నాయి.

పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, టర్కీ, సూడాన్ తదితర దేశాలలో ఈ మీడియా ప్లాట్ ఫార్మ్స్ మీద పరిమితులున్నాయి.

ఇక మన దేశంలో, జమ్మూ & కాశ్మీర్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో శాంతిభద్రతల కారణంగా Facebook, WhatsApp, Twitter, TikTok వంటివి గతంలో పలు సార్లు బ్లాక్ చేశారు. ( TikTok, PUBG Mobile లాంటి చైనా యాప్‌లను కూడా నిషేధించారు). ఏది ఏమైనా, సోషల్ మీడియా ప్రజల దైనందిన జీవితంలో ప్రధాన భాగంగా మారింది.

నేపాల్ ఆందోళనలతో ఇతర కారణాలు కూడా కొన్ని ఉన్నప్పటికీ ప్రధానంగా సోషల్ మీడియా బ్యాన్ తో యువత వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు

ఇదిలా ఉండగా నేపాల్ లో పరిస్థితులను అదుపులో పెట్టడానికి మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కికి తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయాయం తీసుకుంది

ఆమె నియామకం పట్ల ఆందోళనకారులు కూడా సానుకూలంగా స్పందించారు

  కన్నెకంటి వెంకట రమణ. తేదీ.9 .9 .2025

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!