కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని మట్టితో అద్భుతాలు సాధించిన యువకుడు … రాజస్థాన్ నుండి ప్రపంచానికి విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం !
ఒకప్పుడు కార్పొరేట్ ఉద్యోగిగా మెరిసిన దత్తాత్రేయ వ్యాస్ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.
రాజస్థాన్కు చెందిన ఈయన తన కార్పొరేట్ జీవితాన్ని వదులుకుని, మన సంప్రదాయ మట్టి కళలకు కొత్త ఊపిరి పోశారు.
ఈ కథ వింటే మీ కళ్ళు చెమర్చకుండా ఉండలేవు.
కరోనా లాక్డౌన్ సమయంలో యావత్ ప్రపంచం స్తంభించిపోయినప్పుడు దత్తాత్రేయ గారు కుమ్మరుల కష్టాలను చూసి చలించిపోయారు.
వారికి పనిలేక, కనీస ఆదాయం కూడా లేకుండా పోవడంతో, మన తరతరాల మట్టి కళలు కనుమరుగైపోతాయేమోనని ఆయన ఆందోళన చెందారు.
ఆ కష్టం నుంచి పుట్టిందే “స్వదేశీ బ్లెస్సింగ్స్” అనే అద్భుతమైన ఆలోచన.
కార్పొరేట్ ప్రపంచంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్న దత్తాత్రేయ గారు వ్యాపార మెలకువలు తెలుసుకోవడానికి మాత్రం ఎవరి దగ్గరికో వెళ్లలేదు. యూ ట్యూబ్ నే తన గురువుగా ఎంచుకున్నారు
యూట్యూబ్ వీడియోలు చూస్తూ వ్యాపారం ఎలా నిర్వహించాలి, ఆన్లైన్లో ఎలా విక్రయించాలి వంటి విషయాలను నేర్చుకున్నారు.
ఈ ప్రయాణంలో ఆయన కుటుంబం ఆయనకు తోడుగా నిలిచింది.
దళారులను తొలగించి, నేరుగా కుమ్మరుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారికి స్థిరమైన ఆదాయం లభించేలా చేశారు.
ఈ రోజు, దత్తాత్రేయ గారి ప్రయత్నం ఒక పెద్ద ఉద్యమంగా మారింది. కేవలం కొద్ది మందితో మొదలైన ఈ ప్రయాణంలో ఇప్పుడు 120 మందికి పైగా కళాకారులు భాగమయ్యారు.
వారి చేతుల్లో పురుడు పోసుకున్న 65కు పైగా పర్యావరణ అనుకూల మట్టి పాత్రలు, కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
అంతేకాకుండా, వారి వార్షిక టర్నోవర్ ఏకంగా 8 కోట్ల రూపాయలు!
ఇది కేవలం ఒక వ్యాపార విజయం కాదు, మన సంప్రదాయ కళల పట్ల ఒక యువకుడికున్న అంకితభావానికి, కృషికీ నిదర్శనం.
ఇది కేవలం మట్టి కాదు, మన సంస్కృతి!
దత్తాత్రేయ వ్యాస్ గారు చూపించిన దారి ఎందరికో ఆదర్శం.
ఒక కార్పొరేట్ జీవితాన్ని వదిలిపెట్టి, మన దేశ సంస్కృతిని, సంప్రదాయాలను బతికించడానికి ఆయన పడిన కష్టం నిజంగా ప్రశంసనీయం.
ఈ కథ మనందరికీ ఒక గొప్ప సందేశాన్నిస్తుంది: మన సంప్రదాయాలను మనం గౌరవించి, ప్రోత్సహిస్తే, అవి మనకు అద్భుతమైన ఫలాలను ఇస్తాయి.
స్వదేశీ బ్లెస్సింగ్స్ మట్టిపాత్రలు భారతీయసంస్కృతి సుస్థిరజీవనం స్థానికులకోసం భారతదేశంలో తయారైంది. అంతేకాదు ఇవి పూర్తిగా పర్యావరణ అనుకూల ఉత్పత్తులు
రవి వానరసి